‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు

  • సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆరోపణలు
  • పోస్టర్‌లో మత చిహ్నాలను అగౌరవపరిచారని మండిపడ్డ సంఘాలు
  • ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించని నటుడు రణవీర్ సింగ్
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన ‘ధురంధర్ 2’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఏఐ జనరేటెడ్ పోస్టర్‌పై సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ పోస్టర్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పోస్టర్‌లో రణవీర్ సింగ్ ‘కిరాత్‌పూర్ సింగ్’ అనే సిక్కు యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. అయితే, ఏఐతో రూపొందించిన ఈ చిత్రంలో సిక్కు గురువుల చిత్రాలను, పవిత్ర మత చిహ్నాలను అగౌరవపరిచే విధంగా ఉపయోగించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తమ చరిత్ర, సంస్కృతి, మత విశ్వాసాలతో ఆటలాడటం సరికాదని, ఇది సమాజంలో అనవసర ఘర్షణలకు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదులో కేవలం రణవీర్ సింగ్‌ తో పాటు సినిమా దర్శక నిర్మాతలు కూడా బాధ్యత వహించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని సిక్కు సంఘాల ప్రతినిధులు కోరారు. అయితే, ఈ వివాదంపై రణవీర్ సింగ్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Ranveer Singh
Dhurandhar 2
Sikh community
AI poster controversy
Kiratpur Singh
Sikh sentiments
Religious symbols
Bollywood
Police complaint
Film director

More Telugu News